నేషనల్ మెరిట్ స్కాలర్షిప్
రెండింతలైన నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ రూ. 6వేల నుంచి 12వేలకు పెరిగిన ఉపకారవేతనం ఎనిమిదో తరగతి విద్యార్థులకు కేంద్రం వరం సర్కారు స్కూళ్లవారికే అవకాశం లింగాలఘణపురం (జనగామ జిల్లా), 03-08-2018: కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు అందించే స్కాలర్షి్పను రెండింతలు చేసింది. ఈ యేడాది నుంచే ఇది అమలులోకి వస్తుంది. ఇప్పటిదాకా ఏడాదికి రూ. 6వేలు అందజేస్తున్న మానవ వనరుల మంత్రిత్వ శాఖ పెరిగిన విద్యావసరాల ఖర్చుల దృష్ట్యా ఇక నుంచి రూ.12 వేలను అందజేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో వేలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. యేటా సెప్టెంబర్లో అర్హత పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఎంపికచేస్తారు. దీనికి సంబంధించి ఈ నెలలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులను ఎంపిక చేసే బాధ్యత పూర్తిగా సంబంధిత ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులపైనే ఉంటుంది. ఎవరు అర్హులు ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతూ ఏడో తరగతి వార్షిక పరీక్షలో 55శాతం మార్కులు సాధించిన విద్యార్థులు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించే నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ కోసం ని